కేపీఎల్‌టీకి చెందిన ఆరుగురు తీవ్రవాదులు హతo..

- September 23, 2016 , by Maagulf
కేపీఎల్‌టీకి చెందిన ఆరుగురు తీవ్రవాదులు హతo..

అస్సాంలోని కర్బి అంగ్లాంగ్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కర్బి పీపుల్స్ లిబరేషన్ టైగర్స్ (కేపీఎల్‌టీ)కి చెందిన ఆరుగురు తీవ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో కేపీఎల్‌టీ అగ్ర నేతలిద్దరు ఉన్నారు. ఓ సైనిక జవానుకు గాయాలయ్యాయి. నిర్దిష్ట సమాచారం మేరకు పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. బోకజాన్ పోలీస్ స్టేషన్ పరిథిలోని బనిపథర్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారని, పోలీసు సూపరింటెండెంట్ దేబొజిత్ డ్యూరీ చెప్పారు. కేపీఎల్‌టీకి చెందిన ఇద్దరు అగ్ర నేతలతో సహా ఆరుగురు తీవ్రవాదులు మరణించినట్లు, ఒక సైనిక జవానుకు గాయాలైనట్లు తెలిపారు.ఎన్‌కౌంటర్ ప్రదేశం నుంచి ఒక ఎస్ఎల్ఆర్ రైఫిల్, మూడు పిస్టల్స్, రెండు గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com