డిఎన్‌ఎ శాంపిల్స్‌ కొత్త వివాదం

- September 25, 2016 , by Maagulf
డిఎన్‌ఎ శాంపిల్స్‌ కొత్త వివాదం



కువైట్‌: 2015 జులైలో పార్లమెంటు చేసిన డిఎన్‌ఎ చట్టం తాజాగా ఇంకోసారి చర్చనీయాంవమవుతోంది. 1.2 మిలియన్‌ సిటిజన్స్‌ అలాగే 2.3 మిలియన్‌ ఫారినర్స్‌కి సంబంధించిన డిఎన్‌ఎని సేకరించే దిశగా కువైట్‌ నిర్ణయం తీసుకుంది. అయితే, డిఎన్‌ఏ వివరాలు బయటకు వెళ్ళడయినట్లయితే ఆయా వ్యక్తుల ప్రైవసీకి దెబ్బ కలుగుతుందనే విమర్శలున్నాయి. తాజాగా ఎలక్ట్రానిక్‌ పాస్‌పోర్ట్‌ల కోసం డిఎన్‌ఏ వివరాలు తప్పనిసరి చేయడంతో, ఇంకోసారి ఈ అంశం చర్చకు వస్తోంది. గత ఏడాది 100 మందికి పైగా ఫోర్జరీ సర్టిఫికెట్లతో కువైటీ సిటిజన్‌షిప్‌ పొందిన నేపథ్యంలో డిఎన్‌ఏ పరీక్షలు దానికి విరుగుడుగా అధికార యంత్రాంగం చెబుతోంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో డ్యుయల్‌ సిటిజన్‌ షిప్‌ పొందేవారికి ఈ డిఎన్‌ఏ పరీక్షల కారణంగా వివాదాలు ఎదురవుతున్నాయి. కుటుంబ జీవితాలూ గందరగోళం పడే ప్రమాదం ఉంది. ఈ అంశం గురించి పలువురు ప్రస్తావిస్తుండడంపై అధికారిక వర్గాలు స్పందిస్తూ, కేవలం డిఎన్‌ఎ వివరాలు జ్యుడీషియరీకి మాత్రమే పరిమితమవుతాయనీ, ఇవి బహిర్గతమయ్యే అవకాశం లేదు గనుక, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకూ ఇబ్బంది ఉండదనీ తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఈ మేరకు స్పష్టతనిస్తోంది. తన పిల్లల విషయంలో ఓ తండ్రికి అనుమానం వచ్చినాసరే, ఆ వివరాల్ని వెల్లడించే ఆస్కారమే లేదని ఇంటీరియర్‌ మినిస్ట్రీ స్పష్టంగా చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com