డిఎన్ఎ శాంపిల్స్ కొత్త వివాదం
- September 25, 2016
కువైట్: 2015 జులైలో పార్లమెంటు చేసిన డిఎన్ఎ చట్టం తాజాగా ఇంకోసారి చర్చనీయాంవమవుతోంది. 1.2 మిలియన్ సిటిజన్స్ అలాగే 2.3 మిలియన్ ఫారినర్స్కి సంబంధించిన డిఎన్ఎని సేకరించే దిశగా కువైట్ నిర్ణయం తీసుకుంది. అయితే, డిఎన్ఏ వివరాలు బయటకు వెళ్ళడయినట్లయితే ఆయా వ్యక్తుల ప్రైవసీకి దెబ్బ కలుగుతుందనే విమర్శలున్నాయి. తాజాగా ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్ల కోసం డిఎన్ఏ వివరాలు తప్పనిసరి చేయడంతో, ఇంకోసారి ఈ అంశం చర్చకు వస్తోంది. గత ఏడాది 100 మందికి పైగా ఫోర్జరీ సర్టిఫికెట్లతో కువైటీ సిటిజన్షిప్ పొందిన నేపథ్యంలో డిఎన్ఏ పరీక్షలు దానికి విరుగుడుగా అధికార యంత్రాంగం చెబుతోంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో డ్యుయల్ సిటిజన్ షిప్ పొందేవారికి ఈ డిఎన్ఏ పరీక్షల కారణంగా వివాదాలు ఎదురవుతున్నాయి. కుటుంబ జీవితాలూ గందరగోళం పడే ప్రమాదం ఉంది. ఈ అంశం గురించి పలువురు ప్రస్తావిస్తుండడంపై అధికారిక వర్గాలు స్పందిస్తూ, కేవలం డిఎన్ఎ వివరాలు జ్యుడీషియరీకి మాత్రమే పరిమితమవుతాయనీ, ఇవి బహిర్గతమయ్యే అవకాశం లేదు గనుక, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకూ ఇబ్బంది ఉండదనీ తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ మేరకు స్పష్టతనిస్తోంది. తన పిల్లల విషయంలో ఓ తండ్రికి అనుమానం వచ్చినాసరే, ఆ వివరాల్ని వెల్లడించే ఆస్కారమే లేదని ఇంటీరియర్ మినిస్ట్రీ స్పష్టంగా చెప్పింది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









