'బెస్ట్‌ టూరిజం ఏజెంట్‌ అవార్డు' దక్కించుకున్న 'సదరన్‌ ట్రావెల్స్‌'

- September 27, 2016 , by Maagulf

ఈ యేడాది బెస్ట్‌ టూరిజం ఏజెంట్‌ అవార్డు సదరన్‌ ట్రావెల్స్‌కు దక్కింది. విజయవాడలో జరిగిన ప్రపంచ టూరిజం డే ఉత్సవాల్లో ఈ అవార్డును సదరన్‌ ట్రావెల్స్‌ ఎండీ అలపాటి కృష్ణమోహన్‌కు సీఎం చంద్రబాబు అందజేశారు. ఇండియాలోనే అత్యుత్తమ సేవలను అందిస్తున్న సంస్థగా గుర్తింపు తెచ్చుకుందని ఆ సంస్థ ఎండీ వెల్లడించారు. ఏపీలో టెంపుల్‌ టూరిజం ఎక్కువగా ఉంటుందని నార్త్‌ నుంచి పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తున్నారని చెప్పారు. రాజధానిలో 150 గదులతో అన్ని హంగులతో టూరిజం హోటల్‌ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ అవార్డుతో మా బాధ్యత ఇంకా పెరిగిందని సందరన్‌ ట్రావెల్స్‌ ఎండీ ఆలపాటి కృష్ణమోహన్‌ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com