ఎంఎఆర్ వ్యాక్సినేషన్: 294,000 చిన్నారుల టార్గెట్
- September 29, 2016
మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంఓపిహెచ్), జాతీయ స్థాయిలో ఇమ్యునైజేషన్ క్యాంపెయిన్ని మీజిల్స్, మంప్స్ మరియు రుబెల్లాకి వ్యతిరేకంగా చేపట్టింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరిగే ఈ క్యాంపెయిన్లో మొత్తం 294,000 మంది చిన్నారులకు వ్యాక్సినేషన్ ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్, ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్, హమాద్ మెడికల్ కార్పొరేషన్, ఖతార్ పెట్రోలియం, సిడ్రా మెడికల్ అండ్ రీసెర్చ్ సెంటర్ సంయుక్తంగా ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తున్నాయి. ఏడాది నుంచి 13 ఏళ్ళలోపు పిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ని ఇవ్వనున్నారు. 2020 నాటికీ వ్యాధుల్ని ఖతార్ నుంచి తరిమికొట్టేలా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్ట్రాటజీని రూపొందించింది. మొత్తం 12 హెల్త్ సెంటర్స్ని వ్యాక్సినేషన్ కోసం గుర్తించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి కాలంలో దేశంలో మీజిల్స్, మంప్స్, రుబెల్లా కేసులు గణనీయంగా తగ్గాయనీ, ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..







