ప్రైవేటు పెట్టుబడులతో ఫుడ్ ఔట్పుట్కి ఊతం
- September 29, 2016
మస్కట్: ఆహారోత్పత్తుల దిగుమతిని తగ్గించేందుకోసం అగ్రికల్చర్ మరియు ఫిషరీస్ ప్రొడక్షన్ని పెంచడానికి ఒమన్ లాంగ్ టెర్మ్ ప్లాన్ని రూపొందించుకుంది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ మరియు ఫిషరీస్, ఈ మేరకు ఓ రోడ్ మ్యాప్ని రెడీ చేసింది. సుప్రీం కౌన్సిల్ ఫర్ ప్లానింగ్ కోసం ఈ రోడ్ మ్యాన్ని సిద్ధం చేశారు. 2015లో 560 మిలియన్ ఒమన్ రియాల్స్కి అగ్రికల్చర్ మరియు ఫిషరీస్ ప్రొడక్షన్ చేరుకుందనీ, దాన్ని మరింతగా పెంచడానికి ప్రణాళికలు రూపొందించామని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఫుడ్ ప్రొడక్షన్ని పెంచేందుకోసం ప్రైవేటు పెట్టుబడుల్ని ఆకర్షించనున్నట్లు మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మరియు ఫిషరీస్ ఫిషరీస్ డాక్టర్ ఫవాద్ అల్ సజ్వాని చెప్పారు. యువతకు ఫుడ్ ప్రొడక్షన్ విభాగంలో అవకాశం కల్పించడం ద్వారా, కొత్త ఆలోచనలతో వ్యవసాయం, ఫిషరీస్ విభాగంలో అద్భుతాలు సాధించేందుకు వారిని ప్రోత్సహించడం కూడా రోడ్ మ్యాప్లో బాగంగా ఎంచుకున్నారు. 20140 లక్ష్యంగా చేసుకుని ఫుడ్ ప్రొడక్షన్ని అత్యున్నతస్థాయిలో చేసేందుకోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మినిస్టర్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







