రిషిత మరియు స్వర్ణ లను వరించిన ' ప్రవాసి స్త్రీ శక్తి' అవార్డు
- September 29, 2016
అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ మరియు ప్రవాసి మిత్ర సంయుక్తంగా ప్రకటించిన "ప్రవాసి స్ర్తీశక్తి" అవార్డుకు శ్రీమతి రిషిత మరియు స్వర్ణ ఎంపికైనారు.
యూ.ఏ.ఈ.లోని తెలంగాణ సంక్షేమ సంఘం అయున ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్లో(ETCA) మహిళా సభ్యులుగా ఉంటూ తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షిస్తూ, సామాజిక సేవలో చేస్తున్న కృషిని గుర్తించి వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు.
‘ప్రవాసీ బతుకమ్మ’ పేరుతో నిర్వహించే కార్యక్రమంలో,విదేశాల్లో ఉంటూ పలు రంగాల్లో సామాజిక కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించే మహిళల ప్రతిభా పాటవాలను గుర్తించి ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. అక్టోబర్ 2న హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న జీవనజ్యోతి క్యాంపస్లో ఈ అవార్డులను నిర్వాహకులు ప్రదానం చేయనున్నారు.
ఈ సందర్భంగా ETCA వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు అయిన శ్రీ కిరణ్ కుమార్ పీచర గారు మరియు సంఘం సభ్యులు తమ అభినందనలు తెలియజేసారు.
ప్రవాసీ స్ర్తీశక్తి అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన శ్రీమతి రిషిత గుప్తా అన్నారు. కాగా హైదరాబాద్ కు చెందిన శ్రీమతి స్వర్ణ ముమ్మాడి గారు విదేశాల్లో ఉంటున్న భారతీయ మహిళల ప్రతిభా పాటవాలను గుర్తించి అవార్డులు ప్రదానం చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









