రిషిత మరియు స్వర్ణ లను వరించిన ' ప్రవాసి స్త్రీ శక్తి' అవార్డు
- September 29, 2016
అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ మరియు ప్రవాసి మిత్ర సంయుక్తంగా ప్రకటించిన "ప్రవాసి స్ర్తీశక్తి" అవార్డుకు శ్రీమతి రిషిత మరియు స్వర్ణ ఎంపికైనారు.
యూ.ఏ.ఈ.లోని తెలంగాణ సంక్షేమ సంఘం అయున ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్లో(ETCA) మహిళా సభ్యులుగా ఉంటూ తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షిస్తూ, సామాజిక సేవలో చేస్తున్న కృషిని గుర్తించి వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు.
‘ప్రవాసీ బతుకమ్మ’ పేరుతో నిర్వహించే కార్యక్రమంలో,విదేశాల్లో ఉంటూ పలు రంగాల్లో సామాజిక కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించే మహిళల ప్రతిభా పాటవాలను గుర్తించి ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. అక్టోబర్ 2న హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న జీవనజ్యోతి క్యాంపస్లో ఈ అవార్డులను నిర్వాహకులు ప్రదానం చేయనున్నారు.
ఈ సందర్భంగా ETCA వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు అయిన శ్రీ కిరణ్ కుమార్ పీచర గారు మరియు సంఘం సభ్యులు తమ అభినందనలు తెలియజేసారు.
ప్రవాసీ స్ర్తీశక్తి అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన శ్రీమతి రిషిత గుప్తా అన్నారు. కాగా హైదరాబాద్ కు చెందిన శ్రీమతి స్వర్ణ ముమ్మాడి గారు విదేశాల్లో ఉంటున్న భారతీయ మహిళల ప్రతిభా పాటవాలను గుర్తించి అవార్డులు ప్రదానం చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







