రిషిత మరియు స్వర్ణ లను వరించిన ' ప్రవాసి స్త్రీ శక్తి' అవార్డు
- September 29, 2016
అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ మరియు ప్రవాసి మిత్ర సంయుక్తంగా ప్రకటించిన "ప్రవాసి స్ర్తీశక్తి" అవార్డుకు శ్రీమతి రిషిత మరియు స్వర్ణ ఎంపికైనారు.
యూ.ఏ.ఈ.లోని తెలంగాణ సంక్షేమ సంఘం అయున ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్లో(ETCA) మహిళా సభ్యులుగా ఉంటూ తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షిస్తూ, సామాజిక సేవలో చేస్తున్న కృషిని గుర్తించి వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు.
‘ప్రవాసీ బతుకమ్మ’ పేరుతో నిర్వహించే కార్యక్రమంలో,విదేశాల్లో ఉంటూ పలు రంగాల్లో సామాజిక కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించే మహిళల ప్రతిభా పాటవాలను గుర్తించి ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. అక్టోబర్ 2న హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న జీవనజ్యోతి క్యాంపస్లో ఈ అవార్డులను నిర్వాహకులు ప్రదానం చేయనున్నారు.
ఈ సందర్భంగా ETCA వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు అయిన శ్రీ కిరణ్ కుమార్ పీచర గారు మరియు సంఘం సభ్యులు తమ అభినందనలు తెలియజేసారు.
ప్రవాసీ స్ర్తీశక్తి అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన శ్రీమతి రిషిత గుప్తా అన్నారు. కాగా హైదరాబాద్ కు చెందిన శ్రీమతి స్వర్ణ ముమ్మాడి గారు విదేశాల్లో ఉంటున్న భారతీయ మహిళల ప్రతిభా పాటవాలను గుర్తించి అవార్డులు ప్రదానం చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









