స్వచ్ఛ భారత్ పురస్కారాల ప్రధానం..

- September 30, 2016 , by Maagulf
స్వచ్ఛ భారత్ పురస్కారాల ప్రధానం..

స్వచ్ఛ భారత్ వార్షికోత్సవం సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ పురస్కారాలు ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మోడీతోపాటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ ను ప్రజలే విజయవంతం చేశారు..ఎన్నికల గురించి ఆలోచించే పార్టీలు.. స్వచ్ఛ భారత్ ను చేపట్టడం నామోషీగా భావిస్తున్నారు అని అన్నారు. స్వచ్ఛభారత్ ఉపయోగాలు మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది.. బంధువులు ఇంటికి వస్తే ముస్తాబు చేసే మన ప్రజలు.. ఊరిలోని పరిశుభ్రత గురించి మాత్రం పట్టించుకోవడం లేదు.. తమ వస్తువులను శ్రద్దగా చూసుకునే జనం.. పదిమంది ఉపయోగించే వస్తువులను శుభ్రంగా ఉంచడంలేదు అని ఆరోపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com