పాకిస్థాన్లో భారత సినిమాల నిలిపివేత..
- September 30, 2016
నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం చేపట్టిన లక్షిత దాడుల ఫలితంగా పాకిస్థాన్లో ప్రస్తుతం ఆడుతున్న భారతీయ సినిమాలన్నీ నిలిపివేశారు. లాహోర్ సూపర్సినిమా యాజమాన్యం భారత సినిమాలన్నీ నిలిపివేయనున్నట్లు ఫేస్బుక్ ద్వారా వెల్లడించిన వెంటనే కరాచీ న్యూప్లిక్స్ సినిమాస్ కూడా అదే పద్ధతిని అనుసరించింది. దాంతో భారత సినిమాల ప్రదర్శనలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ రెండు థియేటర్లలో హాలీవుడ్ సినిమాలతో పాటు అమితాబ్ నటించిన పింక్ చిత్రం ఆడుతోంది. ఈ రెండు థియేటర్లు తమ నిర్ణయాలు వెల్లడించడంతో మిగతా థియేటర్లు కూడా భారత సినిమాల స్క్రీనింగ్లు నిలిపివేయనున్నాయి.
ఇదివరకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పాక్ నటీనటులను దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించింది. ఆ తర్వాత ఐఎమ్పీపీఏ(ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్) పాకిస్థాన్కి చెందిన నటీనటులను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







