దసరా ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి

- September 30, 2016 , by Maagulf
దసరా ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి

బెజవాడ దుర్గమ్మ సన్నిధి దసరా ఉత్సవాలకు సిద్ధమైంది. గతానికి భిన్నంగా 11రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. శనివారం ఉదయం స్నపనాభిషేకం అనంతరం తొమ్మిది గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. వినాయక ఆలయం నుంచి క్యూలైన్ల ద్వారా సాధారణ భక్తులను అనుమతిస్తారు. రూ.100 టికెట్‌ కొనుగోలు చేసిన వారిని దుర్గా ఘాట్‌ ఎదురుగా ఉన్న క్యూలైన్లలోకి పంపిస్తారు. రూ.300టిక్కెట్‌ కొన్నవారి కోసం ఓంకారం టర్నింగ్‌ నుంచి క్యూలైన్లు ఏర్పాటుచేశారు. వీఐపీలకు రూ.500 టికెట్‌ ఖరారు చేశారు. వారిని పున్నమి ఘాట్‌ నుంచి ప్రత్యేక వాహనాల్లో ఇంద్రకీలాద్రికి తీసుకొస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com