సార్క్ సదస్సు వాయిదా, ఎప్పుడనేది త్వరలో వెల్లడిస్తాం - పాకిస్తాన్
- September 30, 2016
సార్క్ సదస్సును పాకిస్థాన్ వాయిదా వేసుకోక తప్పలేదు. ఉరీ ఉగ్ర ఘటన నేపథ్యంలో భారత్తో పాటు సభ్యదేశాలు ఈ సమావేశానికి హాజరుకాబోమని తేల్చిచెప్పడంతో సదస్సును వాయిదా వేస్తూ పాక్ నిర్ణయం తీసుకుంది. ఈ సదస్సు ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో వెల్లడించనున్నట్లు పాక్ అధికారులు తెలిపారు.
నవంబర్ 9,10 తేదీల్లో ఇస్లామాబాద్లో 19వ సార్క్ శిఖరాగ్ర సదస్సు జరగాల్సి ఉంది. ఉరీ ఘటన నేపథ్యంలో పాక్, భారత్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఈ సమావేశాలకు హాజరయ్యేది లేదని భారత ప్రధాని మోదీ వ్యూహాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ను దౌత్యపరంగా ఏకాకిని చేయాలనే సంకల్పంతో తీసుకున్న మోదీ నిర్ణయానికి సార్క్ సభ్యదేశాలు బాసటగా నిలిచాయి.
మోదీ నిర్ణయం ప్రకటించిన వెంటనే భారత్కు మద్దతిస్తూ బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్గనిస్థాన్లు తాము ఈ సదస్సులో పాల్గొనబోమని స్పష్టం చేశాయి. తాజాగా శ్రీలంక, మాల్దీవులు కూడా సార్క్కు హాజరుకాబోమని ఈ సదస్సుకు నేతృత్వం వహిస్తున్న నేపాల్కు తెలిపాయి. దీంతో సదస్సుకు హాజరుకాని దేశాల జాబితా ఆరుకు చేరింది.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







