బ్రెజిల్‌ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరారీ..

- September 30, 2016 , by Maagulf
బ్రెజిల్‌ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరారీ..

బ్రెజిల్‌లోని అతిపెద్ద నగర మైన సావో పౌలోలోని జైలు నుంచి 200 మంది ఖైదీలు పరారయ్యరు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. ఉదయం వేళల్లో హాజరుకు పిలిచినప్పుడు కొంత మంది ఖైదీలు జైలు గదులకు నిప్పుపెట్టారు. ఈ సంఘటనతో చెలరేగిన అలజడిలో 200 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. 13 అడుగుల ఎత్తైన గోడను దూకి సమీపంలోని నదీతీరం వెంబడి అదేవిధంగా చెరకు పంట పొలాల నుండి ఖైదీలు పారిపోయారు. పారిపోయిన ఖైదీల్లో సగం మందిని పోలీసు అధికారులు గంటలు తిరగకుండానే పట్టుకున్నారు. మిగతావారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. వెయ్యి మంది ఖైదీలు ఉండేట్టు ఈ జైలును నిర్మించారు. ప్రస్తుతం ఇందులో 1800 మంది ఖైదీలు ఉన్నట్టు సమాచారం.ఖైదీల హక్కులను కాలరాస్తున్నారని మానవ హక్కుల సంఘాలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి. బ్రెజిల్‌లో జైలు నుంచి ఖైదీలు పారిపోవడం చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కాగా ఖైదీల పరారీ సందర్భంగా ఎటువంటి నష్టం(గార్డ్స్‌ లేదా ఖైదీలు మరణించడం, గాయపడటం) జరిగింది. ఇప్పటికైతే తెలియరాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com