బ్రెజిల్ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరారీ..
- September 30, 2016
బ్రెజిల్లోని అతిపెద్ద నగర మైన సావో పౌలోలోని జైలు నుంచి 200 మంది ఖైదీలు పరారయ్యరు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. ఉదయం వేళల్లో హాజరుకు పిలిచినప్పుడు కొంత మంది ఖైదీలు జైలు గదులకు నిప్పుపెట్టారు. ఈ సంఘటనతో చెలరేగిన అలజడిలో 200 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. 13 అడుగుల ఎత్తైన గోడను దూకి సమీపంలోని నదీతీరం వెంబడి అదేవిధంగా చెరకు పంట పొలాల నుండి ఖైదీలు పారిపోయారు. పారిపోయిన ఖైదీల్లో సగం మందిని పోలీసు అధికారులు గంటలు తిరగకుండానే పట్టుకున్నారు. మిగతావారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. వెయ్యి మంది ఖైదీలు ఉండేట్టు ఈ జైలును నిర్మించారు. ప్రస్తుతం ఇందులో 1800 మంది ఖైదీలు ఉన్నట్టు సమాచారం.ఖైదీల హక్కులను కాలరాస్తున్నారని మానవ హక్కుల సంఘాలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి. బ్రెజిల్లో జైలు నుంచి ఖైదీలు పారిపోవడం చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కాగా ఖైదీల పరారీ సందర్భంగా ఎటువంటి నష్టం(గార్డ్స్ లేదా ఖైదీలు మరణించడం, గాయపడటం) జరిగింది. ఇప్పటికైతే తెలియరాలేదు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









