పాక్లో భారత టెలివిజన్ ఛానెళ్లపై నిషేధం!
- October 01, 2016
పాకిస్థాన్లో ప్రసారమవుతున్న భారత టెలివిజన్ ఛానల్స్ను ఈ నెల 15నుంచి నిషేధిస్తున్నట్లు పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ ప్రకటించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎలాంటి అనుమతులు లేకుండా శాటిలైట్ లింక్ ద్వారా భారత టీవీ ఛానెళ్లు ప్రసారమౌతున్నట్లు తమకు ఫిర్యాదులు అందినట్లు వెల్లడించింది. ప్రస్తుత భారత్, పాక్ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే భారత చానల్స్ను ప్రసారం చేస్తున్న డిష్, డీటీహెచ్లపై నిషేధం విధించాలని కొంతమేర వాదనలు వెల్లువెత్తినట్లు తెలుస్తోంది. భారత్లో పాక్ కళాకారులపై నిషేధం విధించాలన్న డిమాండ్ను ముంబయిలోని కొన్ని రాజకీయపార్టీలు లేవనెత్తడంతో క్రమంగా ఒక్కో అంశంపై ఇరుదేశాలు మధ్య అగ్గిరాజుకుంటోంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







