పాక్‌లో భారత టెలివిజన్‌ ఛానెళ్లపై నిషేధం!

- October 01, 2016 , by Maagulf
పాక్‌లో భారత టెలివిజన్‌ ఛానెళ్లపై నిషేధం!

పాకిస్థాన్‌లో ప్రసారమవుతున్న భారత టెలివిజన్‌ ఛానల్స్‌ను ఈ నెల 15నుంచి నిషేధిస్తున్నట్లు పాకిస్థాన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా రెగ్యులేటరీ అథారిటీ ప్రకటించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎలాంటి అనుమతులు లేకుండా శాటిలైట్‌ లింక్‌ ద్వారా భారత టీవీ ఛానెళ్లు ప్రసారమౌతున్నట్లు తమకు ఫిర్యాదులు అందినట్లు వెల్లడించింది. ప్రస్తుత భారత్‌, పాక్‌ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే భారత చానల్స్‌ను ప్రసారం చేస్తున్న డిష్‌, డీటీహెచ్‌లపై నిషేధం విధించాలని కొంతమేర వాదనలు వెల్లువెత్తినట్లు తెలుస్తోంది. భారత్‌లో పాక్‌ కళాకారులపై నిషేధం విధించాలన్న డిమాండ్‌ను ముంబయిలోని కొన్ని రాజకీయపార్టీలు లేవనెత్తడంతో క్రమంగా ఒక్కో అంశంపై ఇరుదేశాలు మధ్య అగ్గిరాజుకుంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com