పాకిస్తాన్ ఉగ్రవాదులు మళ్ళీ తెగబడ్డారు...
- October 02, 2016
పాకిస్తాన్ ఉగ్రవాదులు మళ్ళీ తెగబడ్డారు. ఆదివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో బారాముల్లా జిల్లాలోని ఆర్మీ క్యాంపు పై టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ పబ్లిక్ పార్క్ ద్వారా 46 రాష్ట్ర్రీయ రైఫిల్స్ క్యాంప్ లోకి చొరబడేందుకు ప్రయత్నించి కాల్పులు జరిపారు. భారత జవాన్లకు, వారికి మధ్య జరిగిన కాల్పుల్లో ఒక జవాను మరణించగా మరొకరు గాయపడ్డారు.ఇండియన్ ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. టెర్రరిస్టు లు జీలం నది ద్వారా దొంగచాటుగా ఈ జిల్లాలోకి చొరబడినట్టు తెలుస్తోంది. మరోవైపు జమ్మూ జిల్లాలోని పల్లన్ వాలా సెక్టార్ లో పాక్ సైనికులు నియంత్రణ రేఖ వెంబడి పేలుళ్లకు దిగారు. శనివారం కూడా వారు భారత సైనిక పోస్టులు, జనావాస ప్రాంతాల్లో మోర్టార్ బాంబులు, గ్రెనేడ్లతో పేలుళ్లకు పాల్పడ్డారు.
తాజా వార్తలు
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!
- విదేశాలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!
- ఆ రెండు కేసుల్లోనే అబార్షన్..షురా కౌన్సిల్ ఆమోదం..!!









