పాకిస్తాన్ ఉగ్రవాదులు మళ్ళీ తెగబడ్డారు...

- October 02, 2016 , by Maagulf
పాకిస్తాన్ ఉగ్రవాదులు మళ్ళీ తెగబడ్డారు...

పాకిస్తాన్ ఉగ్రవాదులు మళ్ళీ తెగబడ్డారు. ఆదివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో బారాముల్లా జిల్లాలోని ఆర్మీ క్యాంపు పై టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ పబ్లిక్ పార్క్ ద్వారా 46 రాష్ట్ర్రీయ రైఫిల్స్ క్యాంప్ లోకి చొరబడేందుకు ప్రయత్నించి కాల్పులు జరిపారు. భారత జవాన్లకు, వారికి మధ్య జరిగిన కాల్పుల్లో ఒక జవాను మరణించగా మరొకరు గాయపడ్డారు.ఇండియన్ ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. టెర్రరిస్టు లు జీలం నది ద్వారా దొంగచాటుగా ఈ జిల్లాలోకి చొరబడినట్టు తెలుస్తోంది. మరోవైపు జమ్మూ జిల్లాలోని పల్లన్ వాలా సెక్టార్ లో పాక్ సైనికులు నియంత్రణ రేఖ వెంబడి పేలుళ్లకు దిగారు. శనివారం కూడా వారు భారత సైనిక పోస్టులు, జనావాస ప్రాంతాల్లో మోర్టార్ బాంబులు, గ్రెనేడ్లతో పేలుళ్లకు పాల్పడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com