తమిళంలో మాస్, యాక్షన్ హీరోయిన్గా రాయ్లక్ష్మి..
- October 02, 2016
నిత్యం వార్తల్లో నిలిచే రాయ్లక్ష్మి ఈ మధ్య కోలీవుడ్ సినిమాకు దూరమయ్యారు. 'అరన్మణై', 'సౌకారుపేట్టె' వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. 'అకిరా', 'జూలి 2' సినిమాల్లో నటించారు. మరోవైపు మలయాళ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తమిళంలో మాస్, యాక్షన్ హీరోయిన్గా కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. 'గర్జనై' అనే సినిమాలో ఆమె ఈ పాత్ర పోషించారు. ఇందులో 'కల్యాణం ముందల్ కాదల్ వరై' ధారావాహికలో నటించే అమిత్ హీరోగా నటిస్తున్నారు. విలన్గా వంశీకృష్ణ నటిస్తున్నారు.
కథలోకి వెళితే.. ప్రేమికుడు అమిత్ను విలన్ హతమార్చడంతో.. రాయ్లక్ష్మి యాక్షన్ హీరోయిన్గా మారుతుందని సమాచారం. ఆ తర్వాత విలన్ను చంపి ఎలా పగ తీర్చుకుంటున్నదే కథ.
ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ఓ పెద్ద బిల్డింగ్లో రోప్ సాయంతో ఆమె పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. గ్లామర్ సన్నివేశాలకు కూడా ఈ సినిమాలో ఏమాత్రం కొదవుండదని తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం
- సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- కతార్ ఎమిర్–అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్
- కువైట్ గగనతలం తాత్కాలిక మూసివేత
- ఇరాన్ పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- ఒమన్ లో సాధారణ స్థితికి రవాణా కార్యకలాపాలు..!!
- ఫుడ్, నాన్ ఫుడ్ లభ్యత పై అవుట్లెట్లు భరోసా..!!









