సౌదీ వెళ్లిన వైఎస్సార్ జిల్లా వాసి మృతి..

- October 04, 2016 , by Maagulf
సౌదీ వెళ్లిన వైఎస్సార్ జిల్లా వాసి మృతి..

బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లిన వైఎస్సార్ జిల్లా వాసి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లెకు చెందిన కోముద్ది హైదర్‌వలీ(48) కొన్నేళ్లుగా బొరుగుల వ్యాపారం చేసుకుంటూ జీవించేవాడు. ఇతనికి భార్య, నలుగురు సంతానం ఉన్నారు. కుటుంబ పోషణకు సంపాదన చాలక పోవటంతో సౌదీ అరేబియా వెళ్లి మెరుగైన జీవనోపాధి పొందాలనుకున్నాడు. ఈ మేరకు అతడు ఇరవై రోజుల క్రితం సౌదీ అరేబియా రాజధాని జెడ్డా వెళ్లాడు. విధి నిర్వహణలో భాగంగా గత నెల 25వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడు అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. పరిస్థితి విషమించి సోమవారం సాయంత్రం కన్నుమూశాడు.ఈ మేరకు అక్కడి వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మంగళవారం సాయంత్రం చెన్నై ఎయిర్‌పోర్టుకు అతని మృతదేహాన్ని తీసుకువస్తున్నట్లు బంధువులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com