టెర్రరిస్ట్‌ లింక్‌ కేస్‌ అప్పీల్‌ని విచారించనున్న న్యాయస్థానం

- October 04, 2016 , by Maagulf
టెర్రరిస్ట్‌ లింక్‌ కేస్‌ అప్పీల్‌ని విచారించనున్న న్యాయస్థానం

సుప్రీం అపీల్స్‌ కోర్ట్‌, తీవ్రవాదం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 57 మంది అప్పీల్స్‌ని విచారించనుంది. అక్టోబర్‌ 27న ఈ కేసులు విచారణకు రానున్నాయి. ఈ కేసులో కఠిన శిక్షలు ఎదుర్కొంటున్న నిందితులకు, బహ్రెయిన్‌ నేషనాలిటీని కూడా రద్దు చేయడం జరిగింది. 61 మంది జైల్‌ టెర్మ్‌ని అనుభవిస్తుండగా నలుగురు సరైన సాక్ష్యాధారాలు లేపోవడంతో విడిచిపెట్టబడ్డారు. నిందితులపై ప్రాసిక్యూటర్‌ క్రిమినల్‌ ఛార్జెస్‌ని నమోదు చేశారు. కింగ్‌డమ్‌లో తీవ్రవాద గ్రూపుని ఏర్పాటు చేశారన్న ఆరోపణలు నిందితులపై ఉన్నాయి. అల్‌ షిరాజి మూమెంట్‌కి మద్దతుగా ఈ గ్రూప్‌ని ఏర్పాటు చేశారు నిందితులు. నిందితుల్లో ఐదుగురికి జీవితకాల జైలు శిక్ష పడగా, 22 మందికి 15 ఏళ్ళ జైలు శిక్ష పడింది. మిగతావారికి 10 ఏళ్ళ జైలు శిక్ష విధించారు. మొత్తం అందరికీ 500 బహ్రెయిన్‌ దినార్స్‌ జరీమానా, ఒకరికి 1,000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా విధించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com