టెర్రరిస్ట్ లింక్ కేస్ అప్పీల్ని విచారించనున్న న్యాయస్థానం
- October 04, 2016
సుప్రీం అపీల్స్ కోర్ట్, తీవ్రవాదం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 57 మంది అప్పీల్స్ని విచారించనుంది. అక్టోబర్ 27న ఈ కేసులు విచారణకు రానున్నాయి. ఈ కేసులో కఠిన శిక్షలు ఎదుర్కొంటున్న నిందితులకు, బహ్రెయిన్ నేషనాలిటీని కూడా రద్దు చేయడం జరిగింది. 61 మంది జైల్ టెర్మ్ని అనుభవిస్తుండగా నలుగురు సరైన సాక్ష్యాధారాలు లేపోవడంతో విడిచిపెట్టబడ్డారు. నిందితులపై ప్రాసిక్యూటర్ క్రిమినల్ ఛార్జెస్ని నమోదు చేశారు. కింగ్డమ్లో తీవ్రవాద గ్రూపుని ఏర్పాటు చేశారన్న ఆరోపణలు నిందితులపై ఉన్నాయి. అల్ షిరాజి మూమెంట్కి మద్దతుగా ఈ గ్రూప్ని ఏర్పాటు చేశారు నిందితులు. నిందితుల్లో ఐదుగురికి జీవితకాల జైలు శిక్ష పడగా, 22 మందికి 15 ఏళ్ళ జైలు శిక్ష పడింది. మిగతావారికి 10 ఏళ్ళ జైలు శిక్ష విధించారు. మొత్తం అందరికీ 500 బహ్రెయిన్ దినార్స్ జరీమానా, ఒకరికి 1,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







