137 నిబంధనల ఉల్లంఘనల గుర్తింపు
- October 05, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ మరియు కామర్స్ (ఎంఇసి) 137 నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి నోటీసుల్ని సెప్టెంబర్లో జారీ చేసింది. కన్స్యుమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్కి సంబంధించి ఈ నోటీసుల్ని జారీ చేసింది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ చట్టం నెంబర్ 8 - 2008 ప్రకారం పేర్కొన్న నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై చర్యలకు తీసుకోబడ్తాయి. గత సెప్టెంబర్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ నిబంధనల ఉల్లంఘలనలు గుర్తించారు అధికారులు. 5,00 ఖతారీ రియాల్స్ నుంచి 30,000 ఖతారీ రియాల్స్ వరకు ఆయా నిబంధనల ఉల్లంఘనల్ని బట్టి జరీమానాలు విధించబడ్డాయి. అరబిక్లో బిల్స్ ఇవ్వకపోవడం, ప్రోడక్ట్కి సంబంధించిన సమాచారాన్ని పేర్కొనకపోవడం, డిక్లరేషన్స్ మరియు స్టేట్మెంట్స్ని అరబిక్ భాషలో ప్రస్తావించకపోవడం, ఓ ప్రోడక్ట్ని ప్రదర్శనకు ఉంచడం లేదా ప్రచారం చేసిన సందర్భంలో తప్పుడు సమాచారాన్ని ఉపయోగించడం, నిర్ధారిత ధర కంటే ఎక్కువ ధరకు అమ్మడం, గడువు తీరిన పదార్థాల్ని అమ్మడం లేదా ప్రదర్శనకు ఉంచడం వంటివి ఈ నిబంధనల ఉల్లంఘనల్లో గుర్తించబడ్డాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్









