విమానాశ్రయాల్లో హై అలర్ట్
- October 07, 2016
ఉరీ ఉగ్రదాడులతో దొంగ దెబ్బ తీసిన పాక్కు సర్జికల్ దాడులతో భారత్ సరైన సమాధానం చెప్పింది. దాడులకు తెగబడితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. అయినా పాక్ కవ్వింపు చర్యలు మానుకోవడం లేదు. సర్జికల్ చర్య తరువాత కూడా పాక్లోని కొందరు నేతలు, ఆర్మీ అధికారులు కూడా సర్జికల్ స్రైక్స్ ఎలా ఉంటాయో రుచి చూపిస్తామని భారత్కు హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోని ప్రముఖ దేవాలయాలపై, విమానాశ్రయాలపై ఉగ్రవాదులు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించడంతో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపధ్యంలో దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో గట్టి భద్రతా చర్యలను ఏర్పాట్లను చేశారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







