విమానాశ్రయాల్లో హై అలర్ట్‌

- October 07, 2016 , by Maagulf
విమానాశ్రయాల్లో హై అలర్ట్‌

ఉరీ ఉగ్రదాడులతో దొంగ దెబ్బ తీసిన పాక్‌కు సర్జికల్ దాడులతో భారత్ సరైన సమాధానం చెప్పింది. దాడులకు తెగబడితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. అయినా పాక్ కవ్వింపు చర్యలు మానుకోవడం లేదు. సర్జికల్ చర్య తరువాత కూడా పాక్‌లోని కొందరు నేతలు, ఆర్మీ అధికారులు కూడా సర్జికల్ స్రైక్స్ ఎలా ఉంటాయో రుచి చూపిస్తామని భారత్‌కు హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలోని ప్రముఖ దేవాలయాలపై, విమానాశ్రయాలపై ఉగ్రవాదులు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించడంతో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఢిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరు విమానాశ్రయాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. భారత్-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపధ్యంలో దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో గట్టి భద్రతా చర్యలను ఏర్పాట్లను చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com