అమెరికాలోని అత్యంత సంపన్నుల జాబితాలో భారత సంతతి..
- October 09, 2016
అమెరికాలోని అత్యంత సంపన్నుల జాబితాలో భారత సంతతికి చెందిన ఐదుగురికి చోటు దక్కింది. ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ అమెరికాలోని 400మంది సంపన్నుల జాబితాను విడుదల చేసింది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ వరుసగా 23వ ఏడాది తొలిస్థానంలో నిలిచారు.భారత సంతతికి చెందిన సింఫనీ టెక్నాలజీ వ్యవస్థాపకులు రోమేష్ వద్వానీ, ఔట్సోర్సింగ్ సంస్థ సింటెల్ సహ వ్యవస్థాపకులు భరత్ నీర్జా దేశాయ్, ఇండిగో ఎయిర్లైన్స్ సహ వ్యవస్థాపకులు రాకేష్ గంగ్వాల్, పారిశ్రామికవేత్త జాన్ కపూర్, సిలికాన్ వ్యాలీకి చెందిన కవితారక్ రామ్ శ్రీరామ్లు 2016 సంవత్సరానికిగానూ అమెరికాలోని సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.60ఏళ్ల బిల్గేట్స్ 81 బిలియన్ డాలర్ల సంపదతో మొదటిస్థానంలో నిలిచారు. సేవాతత్పరతో కూడా ఆయనే ముందున్నారు. బిల్ అండ్ మిలిందా ఫౌండేషన్ ద్వారా పోలియో నిర్మూలన, మలేరియాను పారద్రోలడం తదితర ఎన్నో సేవా కార్యక్రమాలను ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారు.ఫోర్బ్స్ వెలువరించిన జాబితాలో 3 బిలియన్ డాలర్లతో వాద్వానీ 222 స్థానంలో ఉండగా, 2.5 బిలియన్ డాలర్ల సంపదతో రొమేష్ దేశాయ్(274), 2.2 బిలియన్ డాలర్లతో గంగ్వాల్(321), 2.1 బిలియన్ డాలర్లతో కపూర్(335) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక శ్రీరామ్ 1.9 బిలియన్ డాలర్లతో 361 స్థానాన్ని దక్కించుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







