టర్కీలో కారు బాంబుపేలుడు 6 సైనికులు మృతి

- October 09, 2016 , by Maagulf
టర్కీలో కారు బాంబుపేలుడు 6 సైనికులు మృతి

తీవ్రవాదులు కారుబాంబు పేల్చడంతోటర్కీలో ఆరుగురు సైనికులు మరణించారు. నిఘావర్గాల సమాచారం ప్రకారం.. టర్కీకి ఆగ్నేయ సరిహద్దులో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో ఈ పేలుడు సంభవించింది. సెమ్‌డిన్లి నగరానికి సమీపంలోని డ్యూరాక్‌ జండ్మండరీ స్టేషన్లో ఈ ప్రమాదం సంభవించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ ప్రాంతం ఇరాక్‌, ఇరాన్‌లకు సరిహద్దులో ఉంది. కుర్దిస్టన్‌ వర్కర్స్‌ పార్టీ(పీకేకే) తీవ్రవాదులు ఈ సరిహద్దులో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వాహన తనీఖీలు నిర్వహిస్తున్న సమయంలో పేలుడు సంభవించినట్లు ఓ న్యూస్‌ఏజెన్సీ పేర్కొంది. పలు ఉగ్రవాద సంస్థల ప్రోత్సాహంతో 1984లో పీకేకే ఏర్పాటైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com