శ్రీలంక క్రికెటర్లపై దాడికి సూత్రధారి మృతి....
- October 09, 2016
కరుడుగట్టిన పాకిస్థానీ ఉగ్రవాది క్యూరీ అజ్మల్ను ఆఫ్ఘనిస్థాన్-అమెరికా ప్రత్యేక బలగాలు మట్టుబెట్టాయి. 2009లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన దాడికి సూత్రధారి అజ్మల్. పాకిస్థాన్ను వణికించిన అనేక ప్రధాన ఉగ్రవాద దాడుల్లో అజ్మల్ కీలక పాత్ర పోషించాడు. నిషేధిత లష్కరే-ఈ-జంగీ ఉగ్రవాద సంస్థలో ్ఞఅగ్ర నేతగా వ్యవహరించాడు. అతడికి తెహ్రిక్-ఈ-తాలిబ న్(పాకిస్థాన్) ఉగ్రవాద సంస్థతో బలమైన సంబంధాలు ఉన్నాయి. గత కొంతకాలంగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని పాక్ టిక్కాలో తలదాంచుకుంటున్నాడు.పాక్ టిక్కాలోని తాలిబ న్ స్థావరాలపై జరిపిన దాడుల్లో అజ్మల్ మృతి చెందినట్టు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో కొంత మంది తాలిబన్ నేతలనూ సజీవంగా పట్టుకున్నట్టు అక్కడి గిరిజనులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







