మనోజ్‌ ఠాకూర్‌ని చంపేస్తామంటూ బెదిరింపులు

- October 09, 2016 , by Maagulf
మనోజ్‌ ఠాకూర్‌ని చంపేస్తామంటూ బెదిరింపులు

 జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సైనికస్థావరాలపై జరిగిన ఉగ్రదాడి యావత్‌ భారతాన్ని కలిచివేసింది. ఈ నేపథ్యంలో పాక్‌కు వ్యతిరేకంగా మనోజ్‌ ఠాకూర్‌ అనే సైనికుడు జవాన్లతో నిండిన ఓ బస్సులో నిలబడి పాకిస్థాన్‌ను హెచ్చరిస్తూ ఓ గీతాన్ని ఆలపించారు. 'పాకిస్థాన్‌ చెవులు రిక్కించి విను.. భారత్‌తో పెట్టుకుంటే ప్రపంచ పటంలో నీ రూపురేఖలు లేకుండా పోతాయి. కశ్మీర్‌ ఉంటుంది గానీ.. పాకిస్థాన్‌ మాత్రం ఉండదు'' అంటూ గీతాన్ని ఆలపించారు. దాంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వీర జవాన్లకు సలాం చెబుతూ.. పలువురు నెటిజన్లు ఈ వీడియోను షేర్‌ చేశారు. అయితే ఇప్పుడు మనోజ్‌ ఠాకూర్‌ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.అతడిని చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయట. ఈ విషయాన్ని తోటి సైనికులు ఫేస్‌బుక్‌ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం మనోజ్‌ ఠాకూర్‌కు కిన్నౌర్‌ ప్రాంతానికి పోస్టింగ్‌ వేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com