పాంపోర్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

- October 12, 2016 , by Maagulf
పాంపోర్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

పాంపోర్‌లో మూడు రోజులుగా ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్‌కౌంటర్ ముగిసింది. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం ఉదయం శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్(ఈడీఐ) భవనంలోకి చొరబడిన ఉగ్రవాదులు మూడు రోజులుగా భద్రతా దళాలపైకి కాల్పులు జరుపుతున్న విషయం విదితమే. చివరికి బుధవారం మూడో రోజు భద్రతా దళాలు ముష్కరులను మట్టుబెట్టాయి. కాగా బిల్డింగ్‌లో మరో ఉగ్రవాది దాక్కుని ఉండొచ్చని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఆపరేషన్ ఇంకా కొనసాగుతునే ఉందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఉగ్రవాదులు ఈ బిల్డింగ్‌లోకి చొరబడి భద్రతాధికారులపై కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఐదుగురు అధికారులు, ఇనిస్టిట్యూట్ ఉద్యోగి, ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. అప్పట్లో జరిగిన ఆపరేషన్ 48 గంటల్లో ముగియగా తాజా ఆపరేషన్ 52 గంటల్లో ముగిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com