పాంపోర్ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
- October 12, 2016
పాంపోర్లో మూడు రోజులుగా ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్కౌంటర్ ముగిసింది. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం ఉదయం శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై ఉన్న ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్(ఈడీఐ) భవనంలోకి చొరబడిన ఉగ్రవాదులు మూడు రోజులుగా భద్రతా దళాలపైకి కాల్పులు జరుపుతున్న విషయం విదితమే. చివరికి బుధవారం మూడో రోజు భద్రతా దళాలు ముష్కరులను మట్టుబెట్టాయి. కాగా బిల్డింగ్లో మరో ఉగ్రవాది దాక్కుని ఉండొచ్చని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఆపరేషన్ ఇంకా కొనసాగుతునే ఉందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఉగ్రవాదులు ఈ బిల్డింగ్లోకి చొరబడి భద్రతాధికారులపై కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఐదుగురు అధికారులు, ఇనిస్టిట్యూట్ ఉద్యోగి, ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. అప్పట్లో జరిగిన ఆపరేషన్ 48 గంటల్లో ముగియగా తాజా ఆపరేషన్ 52 గంటల్లో ముగిసింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







