దివ్యాంగులు షిర్డీ సాయి దర్శనానికి క్యూ పద్ధతిని పాటించక్కర్లేదు...
- October 12, 2016
సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు షిర్డీ సాయి దర్శనానికి క్యూ పద్ధతిని పాటించక్కర్లేదు. వారితో పాటు ఏడాది లోపు చిన్నారులున్న మహిళలకు నేరుగా దర్శనం కల్పించాలని నిర్ణయించినట్టు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చైర్పర్సన్ సురేశ్ హవారే తెలిపారు. అంతే కాదు.. దర్శనం కోసం క్యూలలో గంటల తరబడి వేచి చూసే భక్తులకు ఇకపై టీ, కాఫీ, పాలు, బిస్కట్లు ఉచితంగా అందజేయాలని కూడా ట్రస్ట్ నిర్ణయించింది. మహారాష్ట్ర గ్రామాలు, శివారు ప్రాంతాల నుంచి రోగులను తరలించేందుకు 500 అంబులెన్స్లను ట్రస్ట్ సిద్ధం చేస్తోందన్నారు. కాగా, ఆస్ట్రేలియాలో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు, ఆంధ్రప్రదేశ్కు చెందిన అట్లూరి వెంకట్ సుహాస్..షిర్డీ సాయిబాబాకు బంగారు కిరీటాన్ని కానుకగా అందజేశారు. 748 గ్రాముల బరువున్న ఈ కిరీటంలో రూ.20 లక్షల విలువైన ముత్యాలు పొదిగారు. దసరా సందర్భంగా ఆయన షిర్డీ క్షేత్రాన్ని సందర్శించి.. హారతి సమయంలో కిరీటాన్ని అందజేశారని ట్రస్టు తెలిపింది.కాగా, విజయదశమి రోజున లక్ష మంది బాబా దర్శనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







