'చిలుకూరి బాలాజీ' చిత్ర సెన్సార్ పూర్తి...
- October 12, 2016
సాయికుమార్, సుమన్ ప్రధాన తారాగణంగా టీమ్ ఇండియా ప్రొడక్షన్స్ ప్రై. లి. పతాకంపై అల్లాణి శ్రీధర్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'చిలుకూరి బాలాజీ'. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. యు సర్ట్ఫికెట్ లభించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ- సెన్సార్ అధికారుల ప్రశంసలు తమకు ధైర్యాన్ని ఇచ్చాయని, ఇటీవల చిన్నజీయర్ స్వామి విడుదల చేసిన ఆడియోకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోందని, ఈమధ్యకాలంలో వచ్చిన భక్తి సినిమా పాటల్లో ఇవే బాగా ఉన్నాయని పలువురు అభినందిస్తున్నారని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసిన ఈ చిత్రాన్ని నవంబర్ రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని, నేటి యువతరానికి వీసాలు ఇచ్చే బాలాజీగా ఆశీర్వాదాలందిస్తూ ఆరాధింపబడుతున్న చిలుకూరి బాలాజీ ఆలయ పురాణాన్ని ప్రాశస్త్యాన్ని తెలుపుతూ ఓ దృశ్యకావ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించామని ఆయన అన్నారు
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









