దుబాయ్ లో ఎత్తయిన టవర్ నిర్మాణ పనులు ప్రారంభo..
- October 12, 2016
దుబాయ్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యాన్ని నిర్మించేందుకు సోమవారం నిర్మాణ పనులు ప్రారంభించారు. దుబారులోని పేరొందిన బుర్జు ఖలీఫా కంటే ఎత్తులో దీన్ని నిర్మించనున్నారు. 2020 నాటికి దీని నిర్మాణం పూర్తి చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. దుబారు ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. బుర్జు ఖలీఫా 829.8 మీటర్ల ఎత్తు (2722 అడుగు లు) ఉంటుంది. ప్రస్తుతం నిర్మించబోయే ఆకాశహర్మ్యం వెయ్యి మీటర్ల (3,281 అడుగులు ) ఎత్తు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. దీన్ని స్పానిష్-స్విస్ ఆర్కిటెక్ట్ శాంటియాగో డిజైన్ చేశారు. ఈ టవర్ నిర్మాణానికి 1.23 బిలియన్ డాలర్లు ( రూ.8,218 కోట్లు ) ఖర్చయ్యే అవకాశం ఉందని ఎమ్మార్ సంస్థ చైర్మన్ ముహ్మద్ అలబ్బార్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ









