దుబాయ్ లో ఎత్తయిన టవర్ నిర్మాణ పనులు ప్రారంభo..
- October 12, 2016
దుబాయ్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యాన్ని నిర్మించేందుకు సోమవారం నిర్మాణ పనులు ప్రారంభించారు. దుబారులోని పేరొందిన బుర్జు ఖలీఫా కంటే ఎత్తులో దీన్ని నిర్మించనున్నారు. 2020 నాటికి దీని నిర్మాణం పూర్తి చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. దుబారు ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. బుర్జు ఖలీఫా 829.8 మీటర్ల ఎత్తు (2722 అడుగు లు) ఉంటుంది. ప్రస్తుతం నిర్మించబోయే ఆకాశహర్మ్యం వెయ్యి మీటర్ల (3,281 అడుగులు ) ఎత్తు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. దీన్ని స్పానిష్-స్విస్ ఆర్కిటెక్ట్ శాంటియాగో డిజైన్ చేశారు. ఈ టవర్ నిర్మాణానికి 1.23 బిలియన్ డాలర్లు ( రూ.8,218 కోట్లు ) ఖర్చయ్యే అవకాశం ఉందని ఎమ్మార్ సంస్థ చైర్మన్ ముహ్మద్ అలబ్బార్ తెలిపారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









