వివేకవంతుడైన శిష్యుడు
- August 18, 2015
ఒక ఆశ్రమంలో గురువు గారి దగ్గర ఇద్దరు శిష్యులుండేవారు. వారిద్దరిలో తెలివైనవారు, జనానికి ఉపయోగపడేవాడు ఎవడో నిర్ణయించాలని తలచి గురువు వారికి ఒక పందెం పెట్టాడు. వారిద్దరికీ సమానంగా కొంత ధనం ఇచ్చి, శిష్యులారా! నేను మీకిస్తున్న ఈ ధనం చాలా చిన్న మొత్తం. మీరు దీన్ని ఖర్చు చేసి తద్వారా కొన్న వస్తువుతో ఈ గదినంతా నింపాలి అని చెప్పారు. అందుకు ఆ శిష్యులు సరేనని ఇద్దరు వేర్వేరు చోట్టకి వెళ్లి తమ దగ్గరున్న సొమ్ముతో వస్తువులు కొని తేవాలనుకున్నారు. వారిలో ఒక శిష్యుడు తన దగ్గరున్న డబ్బు వమొత్తాన్ని ఖర్చు చేసి ఎండుగడ్డిని కొని తెచ్చి గదంతా నిండబెట్టి గురువుగార్ని పిలిచి చూడమన్నాడు. గురువు వచ్చి చూసి మనసులో చిన్నగా నవ్వుకుని సమాధానం చెప్పకుండానే వెళ్లి పోయాడు. రెండవ శిష్యుడు తన దగ్గర ఉన్న ధనంలో కొంత మాత్రమే ఖర్చు చేసి ఒక దీపాన్ని కొని గదిలో పెట్టి వెలిగించాడు. గురువు అది చూసి గదంతా వెలుగుతో నింపావు. నీవే నలుగురికి మేలు చేయగలవు. నీ తెలివి తేటలు అమోఘం అనీ, నలుగురికి వెలుతురునిద్దామనుకునే నీ వివేకం గొప్పది అని అతన్ని అభినందించాడు. అందుకు మొదటి శిష్యుడు కొంత ముఖం చిన్నబుచ్చుకుని గురువు దగ్గర మరింత కాలం శిక్షణ పొందసాగాడు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







