పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటమే ప్రమాదానికి కారణo
- October 17, 2016
సెంట్రల్ మయన్మార్లోని ఓ నదిలో పడవ ప్రమాదం చోటు చేసుకంది. మొనైవా నగరానికి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింద్విన్ నదిలో పడవ బోల్తా పడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇప్పటికే 14 మంది మృతదేహాలను వెలికి తీశారు. 154 మందిని ప్రాణాలతో రక్షించారు. ప్రమాదం జరిగిన సమయంలో 240 నుంచి 250 మంది వరకు ప్రయాణికులు పడవలో ఉన్నారని, వారంతా యూనివర్శిటీ విద్యార్థులు, టీచర్లు, డాక్టర్లని అధికారి ఒకరు వెల్లడించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మృతుల సంఖ్య 100కి పెరిగే అవకాశముందని ఆయన తెలిపారు. .
ప్రమాదానికి సంబంధించి పడవలో పని చేస్తున్న నలుగురు సిబ్బందిని అరెస్టు చేశామన్నారు.పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటమే ప్రమాదానికి కారణమని అధికారులు వెల్లడించారు. తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు రవాణా కోసం ఎక్కువగా పడవలను ఆశ్రయిస్తుంటారు. పడవ నిర్వాహకులు ప్రమాణాలు పాటించకుండా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటంతో ఇటువంటి ప్రమాదాలు మయన్మార్లో తరచూ జరుగుతున్నాయని అధికారులు అన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







