పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటమే ప్రమాదానికి కారణo
- October 17, 2016
సెంట్రల్ మయన్మార్లోని ఓ నదిలో పడవ ప్రమాదం చోటు చేసుకంది. మొనైవా నగరానికి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింద్విన్ నదిలో పడవ బోల్తా పడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇప్పటికే 14 మంది మృతదేహాలను వెలికి తీశారు. 154 మందిని ప్రాణాలతో రక్షించారు. ప్రమాదం జరిగిన సమయంలో 240 నుంచి 250 మంది వరకు ప్రయాణికులు పడవలో ఉన్నారని, వారంతా యూనివర్శిటీ విద్యార్థులు, టీచర్లు, డాక్టర్లని అధికారి ఒకరు వెల్లడించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మృతుల సంఖ్య 100కి పెరిగే అవకాశముందని ఆయన తెలిపారు. .
ప్రమాదానికి సంబంధించి పడవలో పని చేస్తున్న నలుగురు సిబ్బందిని అరెస్టు చేశామన్నారు.పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటమే ప్రమాదానికి కారణమని అధికారులు వెల్లడించారు. తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు రవాణా కోసం ఎక్కువగా పడవలను ఆశ్రయిస్తుంటారు. పడవ నిర్వాహకులు ప్రమాణాలు పాటించకుండా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటంతో ఇటువంటి ప్రమాదాలు మయన్మార్లో తరచూ జరుగుతున్నాయని అధికారులు అన్నారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









