గల్ఫ్ లో తెలుగు వారిని నిలువునా ముంచేసిన తెలుగు వ్యక్తి

- October 18, 2016 , by Maagulf
గల్ఫ్ లో తెలుగు వారిని నిలువునా ముంచేసిన తెలుగు వ్యక్తి

బతుకుదెరువు కోసం దుబాయ్ కి వెళ్లి అక్కడే స్థిరపడిన తెలుగువారిని తోటి తెలుగు వ్యక్తే నమ్మించి నిలువునా ముంచిన ఘటన వెలుగుచూసింది. విదేశీ గడ్డపై కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకున్న మొత్తాన్ని వసూలు చేసి రూ.45 కోట్లతో ఉడాయించాడని బాధితులు దుబాయ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఓ వ్యక్తి అతని భార్యతో కలిసి అయిదేళ్ల కిందట దుబాయ్ కు వెళ్ళాడు. అక్కడ ఓ కంపెనీలో కొంతకాలం పనిచేశాక సొంతంగా ఓ ఫైనాన్స్ కంపెనీ ప్రారంభించాడు. అక్కడ పనిచేస్తున్న తెలుగువారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. వారం కిందట అతను సుమారు  రూ.45 కోట్లతో అమెరికాకు ఉడాయించినట్లు దుబాయ్ లో ఉన్న తెలుగువారు మాగల్ఫ్.కామ్ కి తెలిపారు. అతడి నిర్వాకం వాళ్ళ సుమారు 50 కుటుంబాలు వీధిన పడ్డాయి. బాధితులు న్యాయం కోసం దుబాయ్, భారత పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై దుబాయ్ లో కేసు నమోదైందిని భాదితులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com