పాక్ భారత్ టీవీ-రేడియో కార్యక్రమ ప్రసాలపై నిషేధం విధించింది..
- October 20, 2016
ఉరి ఉగ్రదాడి నేపద్యంలో భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడమే కాదు.. కొన్ని విషయాల్లో అధికారిక, అనధికారిక నిషేధం కూడా కొనసాగుతున్నాది. భారత్ లో పాక్ కళాకారులపై నిషేధం... గుజరాత్ వ్యాపారులు టమోటో, మిర్చి ఎగుమతులను స్వచ్చందంగా నిలిపివేయడం... ప్రపంచ కబడ్డీ పోటీలకు పాక్ జట్టును నిషేధించడం.. సార్క్ సమావేశాలను బహిష్కరించడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.. కాగా పాక్ ప్రభుత్వం కూడా భారత్ కు సంబంధించిన వాటిపై నిషేధం విధిస్తున్నారు.. ఇప్పటికే ధోని సినిమా రిలీజ్ ను అడ్డుకొన్న పాక్ ప్రభుత్వం.. తాజాగా భారత్ టీవీ-రేడియో కార్యక్రమ ప్రసాలపై నిషేధం విధించింది... ఈ నెల 21 అనగా శుక్రవారం మద్యాహ్నం 3 గంటలనుంచి ఈ నిషేధం అమలు కానున్నట్లు పాకిస్తాన్ ఎలక్ట్రానిక్స్ రెగ్యులేటరీ అథారిటీ నిర్ణయించింది. ప్రభుత్వ సూచన మేరకు ఈ నిషేధం అమలు చేయనున్నట్లు తెలిపింది.. ఎవరైనా పెమ్రా నిర్ణయాన్ని కాదని భారత్ ప్రసారలను చేస్తే వారిపై చర్చలు తీసుకొంటామని... లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









