మణిపూర్ ముఖ్యమంత్రి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు

- October 24, 2016 , by Maagulf
మణిపూర్ ముఖ్యమంత్రి  తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు

మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయనపై సోమవారం అనుమానిత ఎన్ఎస్‌సీఎన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఉక్రుల్ హెలిపాడ్‌లో ఆయనపై దాడి జరిగింది. అదృష్టవశాత్తూ ఆయన గాయపడలేదు. ప్రస్తుతం ఆయన ఇంఫాల్ వెళ్ళారు. ఆదివారం రాత్రి హుండుంగ్ ప్రాంతంలో వరుస బాంబు పేలుళ్ళు సంభవించిన సంగతి తెలిసిందే. ఉక్రుల్ జిల్లా కేంద్రంలో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి ఓక్రమ్ వచ్చారు. ఈ సందర్భంగా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. వారం రోజుల నుంచి ఇండియన్ రిజర్వు బెటాలియన్ జవాన్లు భద్రత ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com