గోపీచంద్‌ సరికొత్త లుక్‌లో......

- October 24, 2016 , by Maagulf
గోపీచంద్‌ సరికొత్త లుక్‌లో......

గోపీచంద్‌ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై రూపొందుతోంది. నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ ''తొలి షెడ్యూల్‌ను అనుకున్న ప్రకారం పూర్తి చేశాం. బ్యాంకాక్‌ ఎయిర్‌పోర్టులో చిత్రీకరించిన ప్రీ క్లైమాక్స్‌, అక్కడి బార్లు, పబ్బుల్లో తీసిన దృశ్యాలు, బ్యాంకాక్‌ బ్రిడ్జ్‌పై హెలికాప్టర్‌తో తెరకెక్కించిన భారీ కార్‌ ఛేజింగ్‌ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. క్యాథరిన ఇంట్రడక్షన సీన, ఫ్యామిలీ, విలన్ సీన్లు కూడా రిచగా వచ్చాయి. గోపీచంద్‌ సరికొత్త లుక్‌లో కనిపిస్తారు. ఈ షెడ్యూల్‌లో దాదాపు 70 మంది నటీనటులు పాల్గొన్నారు.30 రోజుల పాటు చిత్రీకరించాం'' అని చెప్పారు. తనికెళ్ల భరణి, ముఖేష్‌ రుషి, సచిన్ కేడేఖర్‌, నికితన్ ధీర్‌, అజయ్‌, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్ర్కిప్ట్‌ కో ఆర్డినేటర్‌: సుధాకర్‌ పావులూరి, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, యాక్షన్: రామ్‌-లక్ష్మణ్‌, ఎడిటర్‌: గౌతంరాజు, సంగీతం: ఎస్‌.ఎస్.థమన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com