గోపీచంద్ సరికొత్త లుక్లో......
- October 24, 2016
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై రూపొందుతోంది. నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ ''తొలి షెడ్యూల్ను అనుకున్న ప్రకారం పూర్తి చేశాం. బ్యాంకాక్ ఎయిర్పోర్టులో చిత్రీకరించిన ప్రీ క్లైమాక్స్, అక్కడి బార్లు, పబ్బుల్లో తీసిన దృశ్యాలు, బ్యాంకాక్ బ్రిడ్జ్పై హెలికాప్టర్తో తెరకెక్కించిన భారీ కార్ ఛేజింగ్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. క్యాథరిన ఇంట్రడక్షన సీన, ఫ్యామిలీ, విలన్ సీన్లు కూడా రిచగా వచ్చాయి. గోపీచంద్ సరికొత్త లుక్లో కనిపిస్తారు. ఈ షెడ్యూల్లో దాదాపు 70 మంది నటీనటులు పాల్గొన్నారు.30 రోజుల పాటు చిత్రీకరించాం'' అని చెప్పారు. తనికెళ్ల భరణి, ముఖేష్ రుషి, సచిన్ కేడేఖర్, నికితన్ ధీర్, అజయ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్ర్కిప్ట్ కో ఆర్డినేటర్: సుధాకర్ పావులూరి, ఆర్ట్: బ్రహ్మ కడలి, యాక్షన్: రామ్-లక్ష్మణ్, ఎడిటర్: గౌతంరాజు, సంగీతం: ఎస్.ఎస్.థమన.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







