గోపీచంద్ సరికొత్త లుక్లో......
- October 24, 2016
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై రూపొందుతోంది. నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ ''తొలి షెడ్యూల్ను అనుకున్న ప్రకారం పూర్తి చేశాం. బ్యాంకాక్ ఎయిర్పోర్టులో చిత్రీకరించిన ప్రీ క్లైమాక్స్, అక్కడి బార్లు, పబ్బుల్లో తీసిన దృశ్యాలు, బ్యాంకాక్ బ్రిడ్జ్పై హెలికాప్టర్తో తెరకెక్కించిన భారీ కార్ ఛేజింగ్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. క్యాథరిన ఇంట్రడక్షన సీన, ఫ్యామిలీ, విలన్ సీన్లు కూడా రిచగా వచ్చాయి. గోపీచంద్ సరికొత్త లుక్లో కనిపిస్తారు. ఈ షెడ్యూల్లో దాదాపు 70 మంది నటీనటులు పాల్గొన్నారు.30 రోజుల పాటు చిత్రీకరించాం'' అని చెప్పారు. తనికెళ్ల భరణి, ముఖేష్ రుషి, సచిన్ కేడేఖర్, నికితన్ ధీర్, అజయ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్ర్కిప్ట్ కో ఆర్డినేటర్: సుధాకర్ పావులూరి, ఆర్ట్: బ్రహ్మ కడలి, యాక్షన్: రామ్-లక్ష్మణ్, ఎడిటర్: గౌతంరాజు, సంగీతం: ఎస్.ఎస్.థమన.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









