వలసదారుల్లో ఇండియన్లే టాప్
- October 26, 2016
కువైట్: ఇంటీరియర్ మినిస్ట్రీకి చెందిన రెసిడెన్సీ ఎఫైర్స్ డిపార్ట్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం రెసిడెన్సీ వీసాలు ఉన్న వలసదారుల సంఖ్య 2,670,000గానూ, అందులో 901,000 భారతీయ వలసదారులుగాను తేల్చింది. గడచిన ఆరు నెలల్లో 100,000 మంది భారతీయుల సంఖ్య పెరిగింది. ఆ తరువాతి స్థానంలో 587,700 సంఖ్యతో ఈజిప్టియన్లు ఉన్నారు. సిరియన్ల సంఖ్య 145,000గా ఉంది. బంగ్లాదేశీయుల సంఖ్య 202,000 (60,000 పెరుగుదల), 243,000 మంది ఫిలిప్పీన్స్, 39,000 ఇరానియన్స్, 60,00 నేపాలీస్ ఉన్నారు. ఏడు దేశాలకు చెందినవారి సంఖ్య మొత్తం విదేశీయుల్లో 90 శాతానికి పైగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. కువైట్ జనాభాలో 2 / 3 వంతు విదేశీయులే ఉన్నారు. ఈ నేపథ్యంలో వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు అనేక చర్యల్ని అధికారులు తీసుకుంటున్నారు. డెమోగ్రాఫిక్ బ్యాలన్స్ కోసం ఈ చర్యలు తీసుకోవలసి వస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







