వలస టీచర్ల అలవెన్స్ కటింగ్
- October 27, 2016
కువైట్: మినిస్టర్ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ప్లానింగ్ అండ్ వెలప్మెంట్ హింద్ అల్ సుబైయా మాట్లాడుతూ, వలస టీచర్ల రెంట్ అలవెన్స్ తగ్గింపుపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని అరబ్ లేబర్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్లో ఈ మేరకు చర్చిస్తామని చెప్పారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకోవడానికే వలస టీచర్ల అలవెన్స్లను తగ్గించినట్లు ఆయన వివరించారు. సెంట్రల్ స్టాటిస్టికల్ కమిషన్ (సిఎస్సి), టీచర్స్ రెంట్ అలవెన్స్ని 150 కువైట్ దినార్స్ నుంచి 60 కువైట్ దినార్స్కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజ్ఞప్తులు తమకు అందుతున్నాయనీ ఈ నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుబైయా చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరినీ గౌరవించడం జరుగుతుందనీ, ఎవరి పట్లా చిన్న చూపు ఉండదనీ, ఆర్థిక సమస్యలు - సంస్కరణల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోబడిందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







