వలస టీచర్ల అలవెన్స్ కటింగ్
- October 27, 2016
కువైట్: మినిస్టర్ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ప్లానింగ్ అండ్ వెలప్మెంట్ హింద్ అల్ సుబైయా మాట్లాడుతూ, వలస టీచర్ల రెంట్ అలవెన్స్ తగ్గింపుపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని అరబ్ లేబర్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్లో ఈ మేరకు చర్చిస్తామని చెప్పారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకోవడానికే వలస టీచర్ల అలవెన్స్లను తగ్గించినట్లు ఆయన వివరించారు. సెంట్రల్ స్టాటిస్టికల్ కమిషన్ (సిఎస్సి), టీచర్స్ రెంట్ అలవెన్స్ని 150 కువైట్ దినార్స్ నుంచి 60 కువైట్ దినార్స్కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజ్ఞప్తులు తమకు అందుతున్నాయనీ ఈ నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుబైయా చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరినీ గౌరవించడం జరుగుతుందనీ, ఎవరి పట్లా చిన్న చూపు ఉండదనీ, ఆర్థిక సమస్యలు - సంస్కరణల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోబడిందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









