వలస టీచర్ల అలవెన్స్ కటింగ్
- October 27, 2016
కువైట్: మినిస్టర్ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ప్లానింగ్ అండ్ వెలప్మెంట్ హింద్ అల్ సుబైయా మాట్లాడుతూ, వలస టీచర్ల రెంట్ అలవెన్స్ తగ్గింపుపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని అరబ్ లేబర్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్లో ఈ మేరకు చర్చిస్తామని చెప్పారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకోవడానికే వలస టీచర్ల అలవెన్స్లను తగ్గించినట్లు ఆయన వివరించారు. సెంట్రల్ స్టాటిస్టికల్ కమిషన్ (సిఎస్సి), టీచర్స్ రెంట్ అలవెన్స్ని 150 కువైట్ దినార్స్ నుంచి 60 కువైట్ దినార్స్కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజ్ఞప్తులు తమకు అందుతున్నాయనీ ఈ నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుబైయా చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరినీ గౌరవించడం జరుగుతుందనీ, ఎవరి పట్లా చిన్న చూపు ఉండదనీ, ఆర్థిక సమస్యలు - సంస్కరణల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోబడిందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







