ఇరాక్ లో గడ్డాలు తీసి మరీ పారిపోతున్న ఐసిస్ ఉగ్రవాదులు
- October 27, 2016
ఐసిస్ చేతిలోకి వెళ్లిపోయిన మోసుల్ నగరాన్ని ఉగ్రవాదుల కబంధ హస్తాల్లో నుంచి విడిపించడానికి ఇరాక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నగరాన్ని మూడువైపుల నుంచి చుట్టుముట్టిన ఇరాక్ కుర్దీష్ సంయుక్త దళాలు.. ఉగ్రవాదులపై దాడులు జరుపుతూ.. మెల్లిగా నగరంలోకి ప్రవేశిస్తున్నాయి.
ఇప్పటికే ఐదు కి.మీ మేర మోసుల్ నగరంలోకి చొచ్చుకెళ్లిన ఇరాక్ సేనలు.. చాలామంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. దీంతో ఇరాక్, కుర్దీష్ సేనల దూకుడు చూసి ఐసిస్ జిహాదీలు బెంబేలెత్తిపోతున్నారు. వీలైనంత త్వరగా నగరాన్ని వీడి పారిపోవాలనే నిర్ణయానికి వచ్చిన ఉగ్రవాదులు.. తమ స్థావరాలను మార్చేయడంతో పాటు గడ్డాలు తీసేసి, వస్త్రధారణను మార్చుకుని సాధారణ జనంలో కలిసేందుకు యత్నిస్తున్నారు.ఇంకొందరు ఐసిస్ ఉగ్రవాదులు సిరియా ఉత్తరవైపుకు పారిపోతున్నట్లుగా తెలుస్తోంది. మోసుల్ నగరాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాక.. ఐసిస్ కు అడ్డాగా మారిన రక్కాపై దాడి చేయాలనే లక్ష్యంతో ముందడుగువేస్తున్నాయి భద్రతా బలగాలు. రక్కాపై దాడి ద్వారా ఐసిస్ ను నామరూపాల్లేకుండా చేయాలని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. కాగా, నిరంతరం కొనసాగుతున్న దాడుల వల్ల ఇప్పటిదాకా 10వేల మంది మోసుల్ నగర ప్రజలు.. మోసుల్ నుంచి వేరే చోటుకు తరలిపోయినట్లుగా సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







