ఒబామా తొలిసారి తన అధికారిక కార్యాలయంలో దీపావళి వేడుకలు
- October 30, 2016
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తొలిసారి తన అధికారిక కార్యాలయంలో దీపావళి వేడుకలు జరుపుకొన్నారు. తన తర్వాత వచ్చిన అధ్యక్షులు కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ '2009లో నేను , మిచెల్ దీపావళీ జరుపుకొన్నప్పుడు భారతీయులు సంతోషించారు. మేము ముంబయి వెళ్లినప్పుడు మమ్మల్ని ఎంతో గౌరవంగా ఆహ్వనించారు. ఆ అనుభవాన్ని మర్చిపోలేను. దీపావళి సందర్భంగా ఈ సారి నా కార్యాలయంలో మొట్టమొదటి దీపం వెలిగించిన అనుభవం మర్చిపోలేను. దీనిని చూస్తే చీకటి తర్వాత వెలుగు వస్తుందని మనకు అర్థమవుతుంది. ఈ సంప్రదాయాన్ని భవిష్యత్తులో వచ్చే అధ్యక్షులు కూడా పాటిస్తారని భావిస్తున్నాను.మీరు, మీకు ఇష్టమైనవారు ఈ దీపావళికి సుఖసంతోషాలతో ఉండాలని ఒబామా కుటుంబం తరపున కోరుకుంటున్నాను' అని ఒబామా అన్నారు. ఈ విషయాన్ని వైట్హౌస్ ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసిన వెంటనే 1.5లక్షల లైకులు, 33,000 షేర్లు వచ్చాయి.క్లింటన్ శుభాకాంక్షలు దీపావళి సందర్భంగా హిందు, సిక్కు, జైన్, బౌద్ధులకు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్లింటన్ మాట్లాడుతూ.. 'ప్రపంచ వ్యాప్తంగా వందకోట్ల మంది హిందు, సిక్కు, బౌద్ధ, జైనులు, రెండు కోట్ల మంది అమెరికన్లు ఈ దీపావళిని ఘనంగా జరుపుకొంటారు. దీపం చెడుపై విజయానికి చిహ్నంగా నిలుస్తుంది' అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







