బహ్రెయిన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డ నిజామాబాద్ జిల్లా వాసి

- October 31, 2016 , by Maagulf
బహ్రెయిన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డ నిజామాబాద్ జిల్లా వాసి

గతవారం బహ్రెయిన్ లో  ఆత్మహత్యకు పాల్పడ్డ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం షాపూర్ గ్రామానికి చెందిన చాకలి పెద్ద బోజన్న మృతదేహం ఎంపీ కవిత చొరవతో స్వగ్రామం చేరింది. బ్రతుకుదెరువు కోసం బహరైన్‌కు వలస వెళ్లిన సాకలి పెద్ద భూమన్న మనోవేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన‌ తెలంగాణ జాగృతి బహరైన్ శాఖ బాద్యులు, బీఎంసి కిరణ్ లు అవసరమైన చర్యలు తీస్కొని మృతదేహాన్ని స్వదేశం పంపడానికి ఏర్పాట్లు చేసారు. నేటి ఉదయం మృతదేహం శంషాబాద్ విమానాశ్రయం చేరుకొగా ఎంపీ కార్యాలయ సిబ్బంది స్వగ్రామానికి తరలించేందుకు అంబూలెన్స్ ను ఏర్పాటు చేసారు. నేడు స్వగ్రామం షాపూర్ లో జరిగిన అంత్యక్రియలకు జాగృతి మండల కన్వీనర్ ముప్పిడి రామిరెడ్డి, ఇతర‌ నాయకులు హాజరై బోజన్న కుటుంబ సబ్యులను పరామర్శించారు.

--యం.వాసు దేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com