దీపావళికి సందడి చేసిన 'మెగా ఫ్యామిలీ'
- October 31, 2016
దీపావళికి 'మెగా' హీరోలందరూ ఒక చోట కలిశారు.. వారంత కలసి తీసుకున్న ఫొటో పోజ్ అదిరిపోయింది. దీపావళి పండగ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి సహా ఆ కుటుంబంలోని హీరోలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫొటోకు మాంచి పోజొకటి ఇచ్చారు. మెగాస్టార్ కు అటు ఇటు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూర్చున్నారు. వరుణ్ తేజ్ పక్కన బన్నీ, సాయిధరమ్ తేజ్ పక్కన నాగేంద్రబాబు,ఆయన కూతురు నీహారిక నవ్వులు చిందిస్తూ కూర్చున్నారు. బన్నీ వెనుక అల్లు శిరీష్, వరుణ్ తేజ్ భుజంపై చేయి వేసిన చిరు తనయుడు రామ్ చరణ్ నిలబడి ఉన్నారు. ఈ ఫొటోను మెగాస్టార్ 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ట్విట్టర్ ఖాతా ద్వారా రామ్ చరణ్ 'మెగా' అభిమానులతో పంచుకున్నాడు.
'అన్నయ్య కుటుంబం 'మెగా కింగ్ డమ్' మెగా వారసులు..మెగా ఫ్యామిలీ' అంటూ ఆ ట్వీట్ లో రామ్ చరణ్ పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









