దీపావళికి సందడి చేసిన 'మెగా ఫ్యామిలీ'

- October 31, 2016 , by Maagulf
దీపావళికి సందడి చేసిన 'మెగా ఫ్యామిలీ'

దీపావళికి 'మెగా' హీరోలందరూ ఒక చోట కలిశారు.. వారంత కలసి తీసుకున్న ఫొటో పోజ్ అదిరిపోయింది. దీపావళి పండగ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి సహా ఆ కుటుంబంలోని హీరోలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫొటోకు మాంచి పోజొకటి ఇచ్చారు. మెగాస్టార్ కు అటు ఇటు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూర్చున్నారు. వరుణ్ తేజ్ పక్కన బన్నీ, సాయిధరమ్ తేజ్ పక్కన నాగేంద్రబాబు,ఆయన కూతురు నీహారిక నవ్వులు చిందిస్తూ కూర్చున్నారు. బన్నీ వెనుక అల్లు శిరీష్, వరుణ్ తేజ్ భుజంపై చేయి వేసిన చిరు తనయుడు రామ్ చరణ్ నిలబడి ఉన్నారు. ఈ ఫొటోను మెగాస్టార్ 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ట్విట్టర్ ఖాతా ద్వారా రామ్ చరణ్ 'మెగా' అభిమానులతో పంచుకున్నాడు.

'అన్నయ్య కుటుంబం 'మెగా కింగ్ డమ్' మెగా వారసులు..మెగా ఫ్యామిలీ' అంటూ ఆ ట్వీట్ లో రామ్ చరణ్ పేర్కొన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com