మనామాలో భారతీయుడు మృతి
- November 01, 2016
మనామా: తన గదిలో మృతి చెందిన ఒక ప్రవాస భారతీయుని మృతదేహంను ఈ ఉదయం కనుగొన్నారు. 53 ఏళ్ళ వయస్సు గల మమ్మద్ కుంజు మనామా లోని సామాజిక బీమా జనరల్ సంస్థ కార్యాలయంలో (GOSI)లో విధులు నిర్వహిస్తున్నాడు. భారతదేశంలో గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం గత నెలలో బహెరేన్ తిరిగి వచ్చాడు. మమ్మద్ కుంజు తన వసతి వద్ద స్నేహితులతో కల్సి విందు భోజనం చేసిన తరువాత నిద్ర పోవడానికి మంచానికి వెళ్ళినట్లు ఆయన స్నేహితులు పేర్కొంటున్నారు. దక్షిణ భారతదేశం లోని కేరళ రాష్ట్రం నుండి వచ్చిన మమ్మద్ కుంజు ఆకస్మికంగా చనిపోవడంతో అతని స్నేహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహంను సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ మార్చురీకి తరలించారు కుంజుకి చెందిన పాస్ పోర్ట్ మరియు ఇతర పత్రాలు బాబ్ అల్ బహరేన్ పోలీసు స్టేషన్ వద్ద ఉన్నాయి. కుంజు గత 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రవాసులు జీవితం గడుపుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







