తెలంగాణా ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతి
- August 25, 2015
మెదక్ జిల్లా నారాయణ్ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి (67) కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఎస్ఆర్నగర్లోని ఆయన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం తెలంగాణ పీఏసీ చైర్మన్గా కిష్టారెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. కిష్టారెడ్డి నారాణ్ఖేడ్ మండలం పంచ గ్రామంలో జన్మించారు. సర్పంచ్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కిష్టారెడ్డికి శివారాజ్షెట్కర్ రాజకీయ గురువు. బావ, దివంగత నేత, మాజీ ఎంపీ బాగారెడ్డి ద్వారా రాజకీయాల్లో పట్టు సాధించారు. 1977లోపంచగామ సర్పంచ్గా,1982లో నారాయణఖేడ్ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో నారాయణ్ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలుపొందారు. ఇదే సమయంలో టీటీడీ బోర్డు సభ్యునిగా పనిచేసిన ఆయన 1994లో రెండో సారి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. 1999 జరిగిన ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిపొందారు. అలాగే 2009, 2014లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగుదేశం హయాంలో రెండు సార్లు పీఏసీ చైర్మన్గా కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలోనూ కిష్టారెడ్డి అనేక కీలక పదువులు నిర్వర్తించారు. కిష్టారెడ్డి మరణవార్త తెలిసిన వెంటనే నారాయణ్ఖేడ్లో విషాదఛాయలు అలముకున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







