దుబాయ్లో ఈజిప్షియన్ ఫ్లాట్ను అమ్మేసిన భారతీయుడు!
- November 01, 2016
మాయమాటలతో ఓ ఈజిప్షియన్ను మోసగించి తనది కాని ఫ్లాట్ను విక్రయించిన భారతీయుడి కోసం దుబాయ్ పోలీసులు గాలిస్తున్నారు. ఫోర్జరీ, మోసం కేసులు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం వేట ప్రారంభించారు. వారి వివరాల ప్రకారం.. పరారీలో ఉన్న నిందితుడు మరో వ్యక్తితో కలిసి తనది కాని ఓ ఫ్లాట్కు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించాడు. వాటిని ఓ ఈజిప్షియన్ వ్యాపారవేత్త(51)కు చూపించి ఫ్లాట్ను అమ్మకానికి పెట్టాడు. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ జారీ చేసినట్టుగా ఉన్న ఆ డాక్యుమెంట్లను చూసిన వ్యాపారి అతడితో 9,25,650 దిర్హమ్స్(2,52,018 డాలర్లు)కు ఒప్పందం కుదుర్చుకుని చెల్లించాడు. డిసెంబరు 2014- జూన్ 2015 మధ్య ఈ ఘటన జరిగినట్టు బాధిత వ్యాపారి పోలీసులకు వివరించాడు.
నిందితుడిపై ఫోర్జరీ, మోసం కేసులు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







