గడ్డాలు పెంచాలని హకుం జారీ చేసిన ఉగ్రవాదులు
- November 01, 2016
ఇరాక్లోని ఇస్లామిక్స్టేట్ ఆధీనంలోని ఓ ప్రాంతం.. సాధారణ పౌరులను గడ్డాలు పెంచాలని ఉగ్రవాదులు హకుం జారీచేశారు... కొన్ని రోజుల అనంతరం కొందరు పౌరులను కూడలి వద్దకు తీసుకువచ్చారు. ఒక్కొక్కరి గడ్డంలో పెన్ను పెట్టారు.. కొందరి గడ్డాల నుంచి అవి కిందపడిపోయాయి... వారు సరిగ్గా గడ్డం పెంచలేదని అందుకు శిక్షగా కొరడా దెబ్బలతో శిక్షించారు... ఇలాంటి అనేకమైన చిత్ర విచిత్రమైన శిక్షలు ఇస్లామిక్ స్టేట్ పాలనలో వున్నట్టు ఇరాకీ దళాల రాకతో విముక్తి చెందిన ప్రాంతాల వారు వెల్లడించారు. ఇరాకీ దళాలు, పెష్మెర్గ దళాలు కొద్ది రోజుల క్రితం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆధీనంలో వున్న మోసూల్ ప్రాంతంపై దాడులు ప్రారంభించారు.
ఈ ఆపరేషన్లో భాగంగా అనేక గ్రామాలు, పట్టణాలను ఐఎస్ నుంచి విముక్తిచేశారు. ఐఎస్ పాలన అంతం కావడంపై బాధిత ప్రజలు హర్షం వ్యక్తంచేశారు.
సిరియాలోనూ..
సిరియాలో ఇస్లామిక్స్టేట్ ఉగ్రవాదుల ఆధీనంలో వున్న ప్రాంతాల్లోనూ ఇదే రకం శిక్షలు అమలవుతున్నాయి. సిగరెట్లు కాల్చినందుకు బెత్తంతో శిక్ష విధించారు.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







