సిలికానాంధ్ర ఆధ్వర్యంలో 'అంతర్జాతీయ ఐదో కూచిపూడి సమ్మేళనం'

- November 01, 2016 , by Maagulf
సిలికానాంధ్ర ఆధ్వర్యంలో 'అంతర్జాతీయ ఐదో కూచిపూడి సమ్మేళనం'

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఐదో కూచిపూడి సమ్మేళనం విజయవాడలో జరగనుంది. డిసెంబర్‌ 23-25 తేదీల్లో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ మహా సమ్మేళనం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కరపత్రాలను శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర ఛైర్మన్‌, కూచిబొట్ల ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు. నాట్య సమ్మేళనంలో పాల్గొనేందుకు 15 దేశాల నుంచి 5,500 మంది ఔత్సాహికులు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు. ముగింపు రోజైన డిసెంబర్‌ 25న సుమారు 7వేల మందితో మహా బృంద నాట్యం నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com