మెట్రో క్రేన్ కింద నలిగి ఓ అభాగ్యుడు మరణించాడు
- November 02, 2016
మెట్రో క్రేన్ కింద నలిగి ఓ అభాగ్యుడు మరణించాడు. అతనికి దాదాపు 50 ఏళ్ళ వయస్సుంటుంది. క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే అతడు మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని గాంధీభవన్ మొజాంజాహి మార్కెట్ వద్ద జరిగింది. పుట్ పాత్ పై నిద్రిస్తున్న అతనిపై క్రేన్ వెళ్ళింది. క్రేన్ భారీగా ఉండడంతో డ్రైవర్ కు ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి కనిపించలేదని అంటున్నారు. అటుగా వెళుతున్న ప్రయాణీకులు గమనించి క్రేన్ డ్రైవర్ ను అప్రమత్తం చేశారని, అయితే అప్పటికే అతను మరణించాడని అంటున్నారు. క్రేన్ డ్రైవర్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలియలేదు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. - See more
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







