పోలీసుల కూంబింగ్, తనిఖీలు ముమ్మరం చేశారు
- November 02, 2016
ఒడిశా.. మల్కన్ గిరి, ఏవోబీ ప్రాంతంలో హై అలర్ట్.. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా గురువారం అయిదు రాష్ట్రాల్లో బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసుల కూంబింగ్, తనిఖీలు ముమ్మరం చేశారు.మహారాష్ట్ర, ఛత్తీస్ గద్, ఒడిషా, తెలంగాణా, ఏపీ రాష్ట్రాల్లో పూర్తి బంద్ పాటించాలని మావోయిస్టులు పత్రికా ప్రకటనలు, పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం చేశారు మావోయిస్టు అగ్ర నేత ఆర్కే జాడ ఇంకా తెలియకపోవడంతో... ఈ బంద్ ను ఎలాగైనా విజయవంతం చేయాలని మావోయిస్టులు కృత నిశ్చయంతో ఉన్నారు.అటు- . ఏవోబీ సరిహద్దు ప్రాంతాల్లోకి ఒకరోజు ముందుగానే పారామిలిటరీ దళాలు చేరుకున్నాయి. పోలీసుల సూచనలమేరకు ప్రజా ప్రతినిధులంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళారు.భద్రాద్రి జిల్లా చర్ల, దుమ్ముగూడెం, ఇల్లెందు వంటి ప్రాంతాల్లో పెద్దఎత్తున పోలీసు బలగాలను మొహరించారు.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







