రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఓమానీయులు మృతి

- November 05, 2016 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఓమానీయులు  మృతి

మస్కట్  :  సుల్తాన్ కబూస్ జాతీయ రహదారి మీద జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇరువురు ఓమానీయులు దుర్మరణం చెందారు. శుక్రవారం వేకువజామున ఒక కారు ప్రమాదంలో వీరు చనిపోయారు.  
కారు నడుపుతున్న డ్రైవర్ అహ్మద్ బిన్ ఖమీస్ అల్ సిఎబి (34) మరియు ఆ వ్యక్తితో పాటు కారులో కూర్చొని ప్రయాణిస్తున్న 37 ఏళ్ల ఆలీ బిన్ జుమా అల్ జాక్వని ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు రాయల్ ఒమన్ పోలీస్ అధికారులు  ధ్రువీకరించారు . సుల్తాన్ కబూస్ హైవే మీద రాయల్ విమానాలు వెళ్లే మార్గం సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com