'న్యూస్ టైం అస్సాం, 'కేర్ వరల్డ్ టీవీ' చానల్ను ప్రభుత్వం నిషేధించింది...
- November 05, 2016
'ఎన్డీటీవీ ఇండియా' చానల్పై నిషేధం విధించడాన్ని విపక్షాలు తప్పుబడుతుండగానే కేంద్ర ప్రభుత్వం మరో రెండు చానళ్లపై వేటు వేసింది. 'న్యూస్ టైం అస్సాం' చానల్ పలుసార్లు మార్గదర్శకాలను ఉల్లంఘించి, క్షమాపణ కోరుతూ సవరణ ప్రసారం చేయమన్నా చేయలేదు. దీంతో నవంబర్ 9 అర్ధరాత్రి నుంచి 10 అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు ఆ చానల్ ప్రసారాలు నిలిపివేయాలని సమాచార, ప్రసారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది.యజమాని చేతిలో దారుణ చిత్రహింసలకు గురైన పని పిల్లవాడి గుర్తింపు తెలిపేలా ఈ చానల్ ప్రసారాలు చేసి, అతని గౌరవానికి భంగం కలిగించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2013లోనే చానెల్పై నిషేధం విధించాలని మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినా అప్పట్లో అమలు కాలేదు.మరో ఉత్తర్వులో 'కేర్ వరల్డ్ టీవీ' అనే చానల్ను కూడా ప్రభుత్వం నిషేధించింది. అభ్యంతరకర దృశ్యాలను చూపించడంతో నవంబరు 9 నుంచి ఈ చానల్ ప్రసారాలను వారం రోజులపాటు నిషేధించింది
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







